మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి

  • వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి
  • ఎల్. బి నగర్ లో ఘన నివాళులర్పణ
  • జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ నివాళి
  • వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలను ప్రశంస

i Prabhakar Reddy Pays Tribute to YSR Rajasekhara Reddy

 ఎల్. బి నగర్ కామినేని చౌరస్తాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రస్తావించి, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత అని కొనియాడారు.

 రంగారెడ్డి జిల్లాలో, ఎల్. బి నగర్ నియోజకవర్గం కామినేని చౌరస్తాలో, దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు అంజలి అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని, అందులో 108, 104, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, జలయజ్ఞం, రుణమాఫీ, ఉచిత విద్యుత్ మరియు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఉన్నాయి అని గుర్తుచేశారు. ఈ పథకాలు ప్రజలకు ఇంకా ఉపయోగపడుతున్నాయని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి ఎర్రంబెల్లి సతీష్ రెడ్డి, కోలన్ సుధాకర్ గౌడ్, జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు పృధ్వీరాజ్, నరసింహారావు, శ్యామల్ రెడ్డి, శంకరయ్య, విటల్ రెడ్డి, రాజశేఖర్, గిరిజన నాయకులు గాంధీ నాయక్, బుంగరాజు అశోక్, అజయ్, అక్రమ్, సతీష్ మరియు మహిళా నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment