జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం?
హైదరాబాద్:జులై 29
జార్ఖండ్లోని డియోఘర్, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు..
మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మోహన్ పూర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్ట డంతో ఈ ప్రమాదం జరి గిందని పోలీసు అధికారి తెలిపారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో, మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఈ సంఘటన గురించి మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ప్రియరంజన్కు సమాచారం అందించారు.
ఆ తర్వాత ప్రియరంజన్ కుమార్ ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని, మోహన్పూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కు సమాచారం అందించారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా మోహన్పూర్ సిహెచ్సికి పంపారు. ఈ ప్రమాదంపై ఎంపీ నిషికాంత్ దూబే విచారం వ్యక్తం చేశారు