*పార్టీ ఫిరాయింపు పిటిషన్ పై నేడు విచారణ!*
*మనోరంజని ప్రతినిధి*
హైదరాబాద్:ఫిబ్రవరి 10
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టనుంది,
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు లో విచారణ జరగనుంది.
ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ.. బి ఆర్ ఎస్ నాయకులు రిట్ పిటిషన్ వేశారు.
అదేవిధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద్,వేర్వేరుగా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే, ఆ మూడు పిటిషన్లను కలిపి ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కే.వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.
కాగా, బీఆర్ఎస్ ఫిర్యా దుపై లిఖితపూర్వకంగా స్పందించాలని ఈ నెల 4న పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి పాఠకులకు తెలిసింది..