- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏండ్లకు పెంపు.
- కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం.
- అనుభవజ్ఞుల సేవలను సుదీర్ఘంగా ఉపయోగించుకోవడమే లక్ష్యం.
- నిరుద్యోగుల్లో ఈ నిర్ణయంపై అసంతృప్తి.
- ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధన అమల్లోకి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏండ్లకు పెరిగింది. కేంద్ర క్యాబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అనుభవజ్ఞుల సేవల వల్ల పరిపాలన మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. అయితే, ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ముందు క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందింది.
ఈ నిర్ణయం ద్వారా అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరింతకాలం ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం, పదవీవిరమణ వయస్సు పెంచటంపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.