భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి

భైంసా నరసింహ స్వామి ఆలయంలో చోరీ
  • భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ.
  • దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు.
  • ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

 భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల వెండి కిరీటం దొంగిలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

: భైంసా పట్టణంలోని నరసింహ నగర్‌లో ఉన్న ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన చోరీ స్థానికులను కుదిపేసింది. ఆలయ అర్చకులు, స్థానికుల వివరాల ప్రకారం దుండగులు ఆలయంలోని 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల వెండి కిరీటంతో పాటు స్వామివారి హుండిలో ఉన్న నగదును కూడా దొంగలించారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దింపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఈ సంఘటన భక్తులను కలవరపరిచింది. పోలీసులు వీలైనంత త్వరగా దొంగలను పట్టుకోవాలని, ఆలయంలో భద్రతా చర్యలు పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment