ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన నిమిత్తం సోమవారం బయలుదేరారు. ఈ ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.
ముందుగా ఇండోనేషియాలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, మే 8వ తేదీన ఆస్ట్రేలియాకు చేరుకుంటారు. అక్కడ మూడో ఇండియా-ఆస్ట్రేలియా వార్షిక సమ్మిట్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి పాల్గొంటారు.
ఆ తర్వాత, మే 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో ఇరు దేశాల సంబంధాలపై చర్చలు జరుపుతారు.












