వడదెబ్బతో వివాహిత మృతి

వడదెబ్బతో వివాహిత మృతి

వడదెబ్బతో వివాహిత మృతి

మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 18 ;-

:నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని మహాలక్ష్మి గల్లికి చెందిన వివాహిత ఠాగూర్ పూజా(36) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజుల నుండి వ్యవసాయ పనుల నిమిత్తం ఎండలో పని చేయడంతో తీవ్ర అస్వస్థకు గురైంది. దీంతో శుక్రవారం వాంతులు రావడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ కి తీసుకెళ్లగా ఆసుపత్రి లో మృతి చెందింది. మృతురాలికి భర్తతోపాటు కుమార్తె ,కుమారుడు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment