చెన్నై: మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్షో చూసేందుకు వచ్చిన లక్షలాది మంది జనసమూహంలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 16 లక్షల మంది వీక్షకులు పాల్గొనగా, తొక్కిసలాట కారణంగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
లోకల్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఎగబడి, తొక్కిసలాటకు గురయ్యారు. ఈ సంఘటనలో 10 మంది సొమ్మసిల్లగా పడిపోయారు. ప్రస్తుతం ఎయిర్షో ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టు తెలియగా, మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.