అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలుగువారు మృతి

అమరావతి, అక్టోబర్ 16

అమెరికాలో రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు.

మృతులు:

  1. తిరుమూరు గోపి (గూడూరు, తిరుపతి జిల్లా)
  2. రాజినేని శివ (శ్రీకాళహస్తి)
  3. హరిత

గాయపడిన వారు:
హరిత భర్త సాయి చెన్ను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Comment