అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

హైదరాబాద్: అక్టోబర్ 16

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో చోటుచేసుకుంది, ఇందులో రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాల ప్రకారం, ఒకరు తిరుపతి జిల్లా చెందిన వారు కాగా, మరొక ఇద్దరు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

మరో వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు, వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Leave a Comment