కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!

*కర్నూలు బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే!*

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీశారు.మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారి జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బస్సులో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు (22), తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా (27), పిల్వామిన్‌ బేబి (64), కిశోర్‌ కుమార్ (41) రమేష్‌(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌ (51), దీపక్‌ కుమార్‌ (24), అన్డోజ్‌ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్‌ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), జయసూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్‌ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్‌ కుమార్ (18), వేణుగోపాల్‌రెడ్డి (24) ఉన్నారు.

కాాగా, బస్సు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను బ్రేక్ చేసి మృత్యుంజయులుగా బయటపడిన వారిలో జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హరిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, రమేశ్, సుబ్రమణ్యం ఉన్నారు. అయితే, ఫోరెన్సిక్ నిపుణులు డెడ్‌బాడీల శాంపిల్స్ సేకరించి DNA టెస్టులు చేశాకే.. మృతుల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.DS.

Join WhatsApp

Join Now

Leave a Comment