ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చంపిన కొడుకు
యూపీలోని గోండా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒక కొడుకు తన తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. వృద్ధుడు అయిన మన్సూర్ ఖాన్, కొడుకు వద్దని చెప్పినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో విసిగిపోయిన కొడుకు మషూఖ్, తన తండ్రి స్నేహితుడితో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. తండ్రి నిద్రలో ఉండగా, గన్తో ఛాతీలో కాల్చి చంపాడు. పోలీసులు విచారణలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు