భైంసా టౌన్లో మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక కౌన్సిలింగ్
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 21
భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం గుర్తించిన పోలీసులు వారికి, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ IPS, టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ –
👉 మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
👉 ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు భద్రత కోసం అందరూ సహకరించాలని కోరారు.
👉 మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు.
👉 డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టపరమైన నేరమని, అది ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని తెలిపారు.
👉 యువత రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ కౌన్సిలింగ్లో టౌన్ ఎస్సైలు నవనీత్ రెడ్డి, సుప్రియతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.