- సారపాక సెంటర్లో అవగాహన కార్యక్రమం
- వాహనదారులు, స్థానికులకు సైబర్ నేరాలపై సూచనలు
- సైబర్ నేరగాళ్ల తతంగాలు వివరించిన ఎస్ఐ
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో, బూర్గంపాడు ఎస్ఐ నాగబిక్షం సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి అనేక పద్ధతులు అవలంబిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు, స్థానికులకు సైబర్ భద్రతా చిట్కాలు అందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో బూర్గంపాడు ఎస్ఐ నాగబిక్షం సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు మరియు స్థానికులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను, చదువుకున్నవారిని కూడా టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారనే విషయాన్ని ఆయన వివరించారు.
సమాజంలో సైబర్ నేరాలు విస్తరిస్తున్న దృష్ట్యా, పబ్లిక్లో అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్, డెబిట్/క్రెడిట్ కార్డుల వివరాలు ఇతరుల వద్దకు వెల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద కాల్స్ మరియు లింక్స్ నుండి దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా, సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండడం ద్వారా మన ఆర్థిక మరియు వ్యక్తిగత భద్రత కాపాడుకోవచ్చని నాగబిక్షం సూచించారు. స్థానిక ప్రజల నుంచి ఈ అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.