సారంగాపూర్, 4 September
మండలంలోని వింధ్యా స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను ప్రదర్శించారు.
స్థానిక మండలంలోని వింధ్యా స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే. నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు కృష్ణాష్టమి పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణ గోపిక వేషదారణలతో వేదికపై ప్రదర్శనలు ఇచ్చి సంప్రదాయ నృత్యాలు, అలంకారాలతో ఆకట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా ‘ఉట్టి కొట్టే’ కార్యక్రమం కూడా నిర్వహించగా, విద్యార్థుల సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. పండుగలో భాగంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆనందంతో పాటు భక్తి భావాలు పెంపొందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆకుల రమేష్, శ్రీ రామ్ శ్రీనివాస్, సాయినాథ్, శ్రీనివాస్ గౌడ్, అలాగే శ్రీలత, పల్లవి, సుమన్య, లావణ్య, సంధ్యారాణి, స్రవంతి, సులోచన, గౌతమి, దివ్య, సౌజన్య, పావని, ప్రేరణ, శరణ్య, జ్యోతి, కీర్తన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, సిబ్బంది కలిసి జరిపిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు పాఠశాల వాతావరణంలో భక్తి, సాంస్కృతిక ఉత్సాహాన్ని పెంచినట్లు తెలిపారు.












