పెద్దపల్లి, జూలై 14
పెద్దప్ిజి్ాోఅినీతినిరోధశాఖఅధిారమంగళారంమెరపదాడినిర్హించార.మన్సిప్అసిస్టెంట్ఇంజినీర్సతీష్,ాంట్రా్టర్నంచిరూ.2్షంచంతీసంటండగారెడ్హ్యాండెడ్గాపట్టన్నార.ఈఘటనతోమన్సిప్ార్యాయంోంరేగింది.
పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన దాడి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుండి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ కోసం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేగింది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.










