తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు.
మున్సిపల్ కార్యాలయంలో వేడుకల అనంతరం, చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ జిల్లా అధికారులతో కలిసి వేడుకలను వీక్షించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను శాలువాతో సత్కరించారు. రాష్ట్ర పురోగతిలో ఆయన పాత్రను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.








