ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
లాతూర్: అక్టోబర్ 06, 2024
మహారాష్ట్రలోని లాతూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. పురన్మల్ లాహోటీ హాస్టల్లో విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో బల్లి కనిపించడంతో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై హాస్టల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.