మదనపల్లెలో మహిళపై కత్తితో దాడి – హత్యాయత్నం

ఎమ్4 న్యూస్, అన్నమయ్య జిల్లా, మదనపల్లె, అక్టోబర్ 07

 

  • పాత కక్షలతో మహిళపై ప్రత్యర్థుల కత్తి దాడి.
  • బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స.
  • పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

: మదనపల్లెలో ఆదివారం రాత్రి పాత కక్షలతో హత్యాయత్నం జరిగింది. అరవవాండ్లపల్లికి చెందిన హరి భార్య శ్రావణి (25) ఇంటికి వస్తుండగా, ప్రత్యర్థులు పూలపాపయ్య, నారాయణమ్మ, పెద్దలక్ష్మి ఆమెపై దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు. శ్రావణిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ ఉన్నారు.

 అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం రాత్రి హత్యాయత్నం కలకలం రేపుతోంది. అరవవాండ్లపల్లికి చెందిన హరి భార్య శ్రావణి (25) పొలం వద్ద నుంచి ఇంటికి వస్తుండగా, పాత కక్షలతో ప్రత్యర్థులు పూలపాపయ్య, నారాయణమ్మ, పెద్దలక్ష్మి ఆమెను అడ్డగించి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రావణిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Comment