న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

Alt Name: న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు హైదరాబాద్
  • హైదరాబాద్‌లో న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ దాడులు
  • కూకట్పల్లి, బంజారాహిల్స్, మాదాపూర్‌లో సోదాలు
  • ఫైనాన్స్, ఆసుపత్రి వ్యవహారాలు సైతం పరిశీలనలో

Alt Name: న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు హైదరాబాద్

హైదరాబాద్‌లో ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. కూకట్పల్లి, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని కార్యాలయాలు, ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో సోదాలు నిర్వహించారని సమాచారం. ఆయన ఫైనాన్స్, ఆసుపత్రి వ్యవహారాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐటీ శాఖ తన పంజా విసిరింది. సెప్టెంబర్ 24, 2024 మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి, బంజారాహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్ రెయిన్‌బో విస్టాస్ అపార్ట్‌మెంట్‌లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఎనిమిది మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొని, ఐ బ్లాక్‌లో అద్దెకు ఉంటున్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ అధినేత న్యూస్ ఛానల్‌తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి వ్యవహారాల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఆయా ఆస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో పలు కీలక దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment