- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ మార్పులు.
- నిరసనలు నేపథ్యంలో బెటాలియన్ పోలీసుల సస్పెన్షన్.
తెలంగాణలో జరుగుతున్న నిరసనలు, ధర్నాల నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటిలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ వ్యవస్థలో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం, స్పెషల్ పోలీస్ బృందం స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించింది.
: హైదరాబాద్: అక్టోబర్ 28— తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు, ధర్నాలు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ పోలీసుల నిరసనలతో ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర బెటాలియన్ పోలీసు సిబ్బందిని తొలగించి, సెక్యూరిటీ వ్యవస్థలో మార్పులు చేశారు.
ఇప్పటివరకు సీఎం ఇంటి దగ్గర భద్రత కల్పించిన తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది స్థానంలో, ఈ రోజు నుంచి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు.
అయితే, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో, క్రమశిక్షణా చర్యల పేరుతో 39 మంది హెడ్కానిస్టే బుళ్లు మరియు కానిస్టేబుళ్లను శనివారం నాడు సస్పెండ్ చేశారు. ఆదివారం, ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టే బుల్ సహా 10 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, వీరి ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
బెటాలియన్ పోలీసులు తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.