- హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభం.
- వారానికి రెండు రోజులు సేవలు: సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో, గోవా నుంచి గురు, శనివారాల్లో.
- స్లీపర్ క్లాస్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు వివిధ టికెట్ ధరలు.
హైదరాబాద్ నుంచి గోవాకు సికింద్రాబాద్-వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలు అక్టోబర్ 6న ప్రారంభమవుతోంది. వారానికి రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో, వాస్కోడిగామా నుంచి గురు, శనివారాల్లో సేవలు అందిస్తుంది. టికెట్ ధరలు స్లీపర్ క్లాస్లో రూ. 440 నుంచి మొదలై, ఫస్ట్ ఏసీ కోసం రూ. 2,860 వరకు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోవాకు వెళ్లే కొత్త రైలు సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ రైలును అక్టోబర్ 6, 2024న ప్రారంభించనున్నారు. ఇది హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే సౌకర్యం కలిగిన రైలు కావడంతో పర్యాటకులకు బాగా ఉపయోపడనుంది. ఈ రైలు వారానికి రెండు సర్వీసులు అందిస్తుంది, బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి, గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి సేవలు అందించనుంది. రైలు రెగ్యులర్ సర్వీసులు అక్టోబర్ 9 నుంచి ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న రైళ్లలో టికెట్లు పొందడం కష్టమైనందున, ఈ కొత్త రైలు ప్రయాణికుల రద్దీని తగ్గిస్తుంది. రైలు స్లీపర్, థర్డ్ ఎకానమీ, త్రీటైర్, టూటైర్, ఫస్ట్క్లాస్ వంటి వివిధ బోగీలతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
సికింద్రాబాద్-వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బల్లారి, హుబ్లీ వంటి స్టేషన్లలో ఆగుతుంది.
రైలు టైమింగ్స్:
- సికింద్రాబాద్ నుంచి (17039) బుధ, శుక్రవారాల్లో ఉదయం 10:05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది.
- వాస్కోడిగామా నుంచి (17040) గురు, శనివారాల్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు:
- సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు:
- స్లీపర్ క్లాస్: రూ. 440
- థర్డ్ ఎకానమీ: రూ. 1,100
- త్రీ టైర్ ఏసీ: రూ. 1,185
- టూ టైర్ ఏసీ: రూ. 1,700
- ఫస్ట్ ఏసీ: రూ. 2,860
- కర్నూలు నుంచి వాస్కోడిగామాకు:
- స్లీపర్ క్లాస్: రూ. 350
- థర్డ్ ఎకానమీ: రూ. 870
- త్రీ టైర్ ఏసీ: రూ. 950
- టూ టైర్ ఏసీ: రూ. 1,355
- ఫస్ట్ ఏసీ: రూ. 2,255