భర్త వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన మనీషా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని, తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.