మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.
ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం, మందుల లభ్యత, ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు.
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమయపాలనను కూడా ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు.
ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగయ్య, డాక్టర్ ముస్తాక్ అహ్మద్, ఇతర వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని, రోగుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.












