చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి 14 మంది కి తీవ్రగాయాలు
మనోరంజని ప్రతినిధి
చిత్తూరు జిల్లా ఫిబ్రవరి 03
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 14 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.తిరుపతి చెన్నై జాతీయ రహదారి లోని నగరి ప్రభుత్వ ఆసు పత్రికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి జిల్లా వడమాల పేట మండలం సీతారామ పురం గ్రామానికి చెందిన వారు తమిళనాడు రాష్ట్రం తిరుత్తని, పట్టణంలో జరిగే వివాహానికి, ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వెళ్లి వస్తుండగా నగరి సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. .
వేగంగా ఢీకొనడంతో బస్సులో ఒకవైపు కూర్చున్న ప్రయాణికులే ప్రమాదానికి గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందిగా మరికొద్ది మంది తీవ్రంగా గాయప డ్డారు.
ప్రమాదంలో వడమాలపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థ సారథి, రాజేంద్ర నాయుడు తోపాటు తిరుపతికి చెందిన 8 ఏళ్ల మణికంఠ తో పాటు 60 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉండగా.. క్షతగాత్రులను నగరి ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు