- పేగు క్యాన్సర్తో బాధపడుతున్న భైంసా వాసి రాజు
- వైద్యం కోసం కుటుంబం అన్ని అవకాశాలు వెచ్చించినా, నిధుల కొరత
- దాతల సహాయం కోసం ఆర్థిక సహాయం కోరుతూ బాధపడుతున్న కుటుంబం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన రాజు పేగు క్యాన్సర్తో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబం ఇప్పటికే చిన్న ఇల్లు అమ్మి, అన్ని సంపాదన అవకాశాలు వాడి, తన వైద్యానికి ఎంతగానో ప్రయత్నించింది. ప్రస్తుతం, డబ్బులు లేక రాజు కుటుంబం దాతల నుండి ఆర్థిక సహాయం కోరుతోంది. రాజు కూడా కళ్లలో నీరుపెట్టుకొని తన ప్రాణాలు నిలబెట్టమని సహాయం కోరుతున్నాడు.
: భైంసా పట్టణంలోని పురాణబజార్లో నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన రాజు ప్రస్తుతం పేగు క్యాన్సర్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాటం చేస్తోంది. రాజు తల్లి చిన్న ఇల్లు అమ్మి, ఇల్లు తిరుగుతూ బట్టలు ఉతుకుతూ, తండ్రి కూలీ పనులు చేసుకుంటూ కొడుకుకు వైద్యం అందించడానికి ఎంతో ప్రయత్నించారు. వీరి చెల్లి కూడా ఎడా పెడా పనిచేసి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తోంది.
ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులు భరించడం వీరి పక్షంలో సాధ్యం కాకుండా పోయింది. ప్రస్తుతం డబ్బుల కొరతతో రాజు ప్రాణాలను నిలబెట్టే స్థితిలో లేకుండా పోయారు. రాజు కుటుంబం కష్టాలను ఎదుర్కొంటూ, చేతులు జోడించి దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. రాజు కూడా తన బాధను ఆవేదనగా చెప్పుతూ, “అన్నా, నన్ను బ్రతికించండి, సహాయం చేయండి” అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
రాజుకు సహాయం చేయదలచిన వారు 9553886532 నంబరుకు సంప్రదించవచ్చు.