టీకా వికటించి శిశువు మృతి – అధికారుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యుల ఆగ్రహం

Infant Death Due to Vaccine Failure
  • రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 45 రోజుల శిశువు మృతి.
  • స్థానిక పీహెచ్సీలో టీకా వేసిన కొన్ని గంటల్లోనే అపస్మారక స్థితికి చేరిన శిశువు.
  • తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ.
  • పాప మృతికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
  • ఆసుపత్రి ఎదుట తీవ్ర ఆందోళన, ధర్నాకు దిగిన స్థానికులు.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతుల 45 రోజుల చిన్నారి మృతి చెందిన ఘటన ఆశ్చర్యం, ఆగ్రహానికి గురిచేస్తోంది.

శిశువుకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) లో టీకా వేసిన కొన్ని గంటల్లోనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన తల్లిదండ్రులు తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే పాప మరణించిందని వైద్యులు ప్రకటించారు.

శిశువు మరణానికి టీకా వికటించడమే కారణమా? లేక వైద్యుల నిర్లక్ష్యమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాప మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment