నేడు సుప్రీంకోర్టులో గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ

Supreme Court: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ జరగనుంది. అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో అభ్యర్థులు, రిజర్వేషన్ల అమలులో తెలంగాణ ప్రభుత్వం లోపం కల్పించిందని పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నిరుద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

కోర్టు తీర్పు ఉత్కంఠ: హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జీవో 29 రద్దు తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లినా, అక్కడ కూడా అభ్యర్థులకు అనుకూలంగా రాలేదు. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉత్కంఠ నెలకొంది.

Leave a Comment