విద్యార్థులకు ప్రగతి పత్రాల పంపిణీ – వేసవి జాగ్రత్తలపై అవగాహన

విద్యార్థులకు ప్రగతి పత్రాల పంపిణీ – వేసవి జాగ్రత్తలపై అవగాహన

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్దులకుంట ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ప్రగతి పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదివిన మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తరగతి వారీగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు చేతులమీదుగా ప్రగతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వేసవి కాలంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేడి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని, నీటిని ఎక్కువగా త్రాగాలని, సూర్యకిరణాలకు నేరుగా గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరీష్ రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, చంద్రశేఖర్ రావు, టి. నరెందర్, బి. నరెందర్, భూమా రెడ్డి, ముర్తూజాఖాన్‌లు పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై విద్యా పురోగతిపై ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment