- ఒడిశా, బెంగాల్ తీరాలపై అలర్ట్ జారీ
- 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా
- పూరి-సాగర్ ఐలాండ్ వద్ద తీరందాటనుందని అంచనా
- తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
- ఏపీ పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. ఇది 15 కి.మీ వేగంతో ఒడిశా, బెంగాల్ తీరాల వైపు కదులుతోంది. పూరి-సాగర్ ఐలాండ్ వద్ద రాత్రికి తీరం దాటనుంది. ఈ సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ అయ్యాయి.