రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం
ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్తో యువకుడికి రూ.70 వేల నష్టం..
ట్రెండింగ్లో ఉన్న ఏఐ ఫోటో ఎడిట్ యాప్తో ఓ యువకుడు కష్టార్జిత డబ్బును కోల్పోయిన సంఘటన సంచలనం రేపింది..
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్కు గురయ్యాడు.
బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తమైంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హెచ్చరిక: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త యాప్ల పేరుతో అమాయకులను మోసగిస్తున్న నేపథ్యంలో, ప్రజలు అపరిచిత యాప్లలో వ్యక్తిగత ఫోటోలు, బ్యాంక్ వివరాలు, లేదా అనుమానాస్పద లింకులు ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.