ఆదిలాబాద్: ఉపాధి కోసం వస్తె.. ఉసురుపోయింది
ఉపాధి కోసం ఆదిలాబాద్కు వచ్చిన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెల్లి తండాకు చెందిన శివరాం, తన కుటుంబంతో కలిసి ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న అతడు అక్కడే మృతి చెందాడు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబీకులు ఈ విషయాన్ని ధృవీకరించారు.