భారత్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్?
హైదరాబాద్:ఆగస్టు 13
భారత్ లో పాకిస్థాన్ గూఢచారి గా పనిచేస్తున్న 32 ఏళ్ల మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని రాజస్థాన్లో అరెస్టు చేశారు. జైసల్మేర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ కాంట్రాక్ట్ మేనేజర్ మహేంద్ర ప్రసాద్ను అరెస్టు చేశారు.
పాకిస్తాన్ నిఘా సంస్థ ISI కోసం గూఢచర్యం చేయడం, దేశ రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని సరిహద్దు దాటి పాకిస్తాన్కు పంపడం వంటి ఆరోపణల పై రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది.
మహేంద్ర ప్రసాద్ను ఈరోజు బుధవారం కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుంచి అతన్ని రిమాండ్కు తీసుకెళ్లి ప్రశ్నించనున్నారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని, రాజస్థాన్ సిఐడి ఇంటెలి జెన్స్ రాష్ట్రంలో విదేశీ ఏజెంట్లు నిర్వహించే దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచిం దని సిఐడి ఇన్స్పెక్టర్ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు.
ఈ సమయంలో ఉత్తరా ఖండ్లోని అల్మోరాలోని పాల్యున్ నివాసి, జైసల్మేర్లోని డి ఆర్ డి ఓ గెస్ట్ హౌస్ చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో కాంట్రాక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ నిఘా సంస్థతో సంప్రదిం పులు జరుపుతున్నాడని,
క్షిపణులు, ఇతర ఆయు ధాలను పరీక్షించడానికి ఫైరింగ్ రేంజ్కు వచ్చే డి ఆర్ డి ఓ శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలికల గురించి పాకిస్తాన్ మాస్టర్లకు రహస్య సమా చారాన్ని అందజేస్తున్నాడని తెలిసింది.
అనుమానితుడు మహేంద్ర ప్రసాద్ను సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో నిఘా సంస్థలు సంయు క్తంగా విచారించాయని, అతని మొబైల్ ఫోన్ను పరిశీలించామని, డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు. అతను డి ఆర్ డి ఓ భారత సైన్యానికి సంబం ధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ హ్యాండ్లర్లకు అందజేస్తు న్నాడని దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
నిందితుడు మహేంద్ర ప్రసాద్ పై 1923 అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి, గూఢచర్యం ఆరోపణలపై రాజస్థాన్ కు చెందిన సిఐడి ఇంటెలి జెన్స్ అరెస్టు చేసింది