ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
జమ్మలమడుగు: అక్టోబర్ 06
జమ్మలమడుగు మండలం చదిపిరాళ్ళదిన్నె గ్రామానికి చెందిన కాచన వెంకటరమణమ్మ (39) అనారోగ్యంతో మరణించగా, ఆమె అంత్యక్రియలకు బంధువులు లేకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఛైర్మన్ మోరె లక్ష్మణ్ రావు తన ఫౌండేషన్ సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునేంద్ర, టౌన్ సెక్రెటరీ నరేంద్ర, కానిస్టేబుల్ భాస్కర్ సహా పలు ప్రముఖులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్కు సహాయం అందించదలచిన దాతలు ఈ నెంబర్లను సంప్రదించవచ్చు: +91 82972 53484, +91 9182244150.