బోరేగంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
రూ 65వేల వరకు ఆస్తి నష్టం..
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 1
ముధోల్ మండలంలోని బోరిగాంగ్రామంకు చెందిన చోర్ మార్ లక్ష్మి అనే మహిళ ఇల్లు సోమవారం ఉదయం ప్రమాదవశాత్తుగా దగ్ధమైంది. సుమారు రూ.65 వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. స్థానికులు రెవెన్యూ అధికారుల కథనం ప్రకారం బాధితురాలు తన ఉన్న ఇంట్లోని దేవుళ్ళ కు దీపం ముట్టించి ఇతర గ్రామానికి బయలుదేరింది. ప్రమాదవశాత్తు ఆ దీపం ఇంటికి తగిలి మంటలు అంటుకున్నాయి ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలికి ఫోన్ చేసి మంటలు చుట్టుపక్క వ్యాపించకుండా నీళ్లను పోసి చల్లార్చారు. ఇంట్లో ఉన్న బట్టలు, ఆహార ధాన్యాలు నగదు రూ20వేల రూపాయలు తదితరవి కాలి బూడిద అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ నారాయణ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామ నిర్వహించారు. సుమారు రూ65 వేల వరకు ఆస్తినష్టం వాటినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది