ఏసీబీ చిక్కిన సిరిసిల్ల సర్వేయర్..!
బాధితుని నుండి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబాటు
సిరిసిల్ల, అక్టోబర్ 14, 2025 (M4News):
సిరిసిల్ల జిల్లాలో లంచం తీసుకుంటూ ఒక సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. చిన్న బోనాల గ్రామానికి చెందిన సర్వేయర్ వేణు, సర్వే పనుల కోసం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో మొదట రూ.10 వేల స్వీకరించిన అతను, సర్వే పూర్తయిన తర్వాత మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.