వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో మనప్పురం గోల్డ్ లోన్ మేనేజర్ విశాల్ బంగారం ఎత్తుకెళ్లాడు.
ఈ ఘటనకు సంబంధించి కస్టమర్లు ఆందోళన చెందుతూ మనపురం గోల్డ్ కార్యాలయంలో హంగామా చేస్తున్నారు.
సుమారు మూడు కోట్ల 25 లక్షల విలువైన మూడు కేజీల బంగారం మాయం కావడం బాధాకరమని మనపురం సిబ్బంది తెలిపారు.
ఈ సమయంలో బ్రాంచ్కు చేరుకున్న కస్టమర్లు సిబ్బందిని నిలదీస్తూ, తమ నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.