అక్రమ మద్యం పట్టివేత – కేసు నమోదు
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 03
స్థానిక సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం సారంగాపూర్ మండలం కుప్టి తండాలో పోలీసులు బెల్ట్షాప్పై దాడి నిర్వహించారు. తనిఖీలలో 41.79 లీటర్ల అక్రమ మద్యం సుమారు అంచనా ₹17,791 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్షాప్ నిర్వహకుడు పోతింట్ల రాములుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.