భీమ్గల్లో ఆర్టీసీ బస్ టక్కర్ – యువకుడు తీవ్రంగా గాయపాటు
మనోరంజని తెలుగు టైమ్స్ భీంగల్ ప్రతినిధి అక్టోబర్ 15
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల పరిధిలో సోమవారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హమద్ ప్రభుత్వ కళాశాల చదువు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా, ఆర్మూర్ నుండి భీమ్గల్ వైపు వస్తున్న TS16 UA 6617 నంబర్ ఆర్టీసీ బస్సు అతని బైక్ను ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ అతి వేగంగా, అజాగ్రత్తగా నడిపిన కారణంగా హమద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి బంధువు భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.