కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి
షామ్లీ (ఉత్తరప్రదేశ్):
ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఘోర హత్య కలకలం రేపింది.
17 ఏళ్ల కుమార్తె ముస్కాన్ ఫోన్లో చాటింగ్ చేస్తున్నదని గమనించిన తండ్రి, ఆగ్రహంతో ఆమెను మేడపైకి తీసుకెళ్లి పిస్టల్తో కాల్చి చంపాడు.
ఈ నరమేధంలో ముస్కాన్ 15 ఏళ్ల తమ్ముడు కూడా భాగస్వామి అయినట్టు పోలీసులు తెలిపారు.
ముస్కాన్ ఒక అబ్బాయితో చాటింగ్ చేయడం కుటుంబ పరువుకు మచ్చ తెస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టామని తండ్రి, తమ్ముడు విచారణలో ఒప్పుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.