మొరం అక్రమ తవ్వకాలు…?
జేసీబీ-మూడు ట్రాక్టర్లు స్వాధీనం
తానూరు మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21
తానూర్ మండలం బోరిగాం బాలాజీ గుట్ట సమీపంలో గల ఎల్వి శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 266 లో అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తున్న ఒక జేసీబీ మరియు మూడు ట్రాక్టర్లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్.ఐ నరేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతూ ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తున్నట్లు పక్క సమాచారం మేరకు తహశీల్ధార్ మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని, అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీ, అలాగే మొరం తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని తహశీల్దార్ సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వాహనాలను తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన తరలించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ స్పష్టం చేశారు