సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ దాడులు
సూర్యాపేట జిల్లా కోదాడలోని ఫారెస్ట్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది.
రైతు నుంచి ₹20 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రేంజ్ ఆఫీసర్ వెంకన్నను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.
సాధారణ పనుల పరిష్కారానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఏసీబీ జోక్యం చేసుకుని ట్రాప్ ఏర్పాటు చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం వెంకన్నను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.