కానిస్టేబుల్ హరిప్రసాద్ దుర్మరణం
మనోరంజని ప్రతినిధి – మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా నర్సింహాలపేటకు చెందిన కానిస్టేబుల్ హరిప్రసాద్ (PC 3559) దుర్మరణం చెందారు. ప్రస్తుతం తొర్రూర్ సర్కిల్ ఆఫీసులో కానిస్టేబుల్గా అటాచ్ అయి పనిచేస్తున్నారు.
శనివారం ఉదయం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందనుంచి దాటుతుండగా, అదే సమయంలో రైలు కదలడంతో ప్రమాదవశాత్తు గాయపడి అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనతో పోలీసులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.