మహబూబ్ నగర్: ఆగిన లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. వ్యక్తి స్పాట్ డెడ్
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మిడ్జిల్ మండల పరిధిలోని వాడ్యాల్ లో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన గోవింద చారి (60) తన వృత్తిరీత్యా పెళ్లిళ్ల పేరయ్యగా, ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తుండగా… పనుల నిమిత్తం జడ్చర్ల వెళ్లి తన సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.