మెదక్‌ జిల్లా అనిల్‌ హత్య కేసులో పోలీసులు సూత్రప్రాయంగా విచారణ ప్రారంభం

మెదక్‌ జిల్లా అనిల్‌ హత్య కేసులో పోలీసులు సూత్రప్రాయంగా విచారణ ప్రారంభం

మెదక్‌ జిల్లా అనిల్‌ హత్య కేసులో పోలీసులు సూత్రప్రాయంగా విచారణ ప్రారంభం

📰 M4News – జూలై 18, 2025 – సంగారెడ్డి

మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ కార్యదర్శి మారెపల్లి అనిల్‌కుమార్‌ హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును ఛేదించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో వేగంగా విచారణ చేస్తున్నారు.

గాంధీ భవన్‌ సమావేశం అనంతరం అనిల్‌ బయల్దేరిన వెంటనే రెండు వాహనాలు అతడిని అనుసరించినట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దారిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తును కొనసాగిస్తోంది.

📱 ముగ్గురు అనుమానితులు అదుపులోకి

అనిల్‌ ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని కాల్‌ డేటాను విశ్లేషిస్తూ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. భూ వివాదాల నేపథ్యంలో అనిల్‌పై సుఫారీ హత్య జరిగిందన్న కోణాన్ని పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు.

👥 వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులపై దృష్టి

‘జనతా గ్యారేజీ’ అనే పేరుతో ఉన్న అనిల్‌ స్నేహితుల వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులను కూడా విచారణకు పిలిపించారు. హైదరాబాద్‌ రియల్టీ వ్యాపారంతో అనిల్‌కు సంబంధాలున్నాయన్న కోణంలో విచారణను మరింత వేగవంతం చేశారు.

🔍 ఎస్పీ ప్రకటన

కేసు పూర్తిగా విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని మెదక్‌ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసుపై గోప్యతతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వివరాలకు ఎదురు చూస్తూ…

Join WhatsApp

Join Now

Leave a Comment