అమెరికాలో కాల్పులు.. HYD యువకుడి మృతి
మనోరంజని ప్రతినిది
హైదరాబాద్ జనవరి 20
విదేశాలకు వెళ్లిన మరో తెలంగాణ వాసి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మృతి చెందాడు. అతడి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.