ఇప్పటికే రూ. 50 కోట్లు బోనస్ రూపంలో చెల్లించాం
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
గజ్వేల్, నవంబరు 19:
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను చేపట్టామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు.
అభ్యర్థించిన మేరకు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. సోమవారం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనూచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా, రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. మొదటిసారిగా రైతులకు బోనస్ ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 50 కోట్లను బోనస్ రూపంలో చెల్లించినట్లు చెప్పారు.