ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్: అక్టోబర్ 17, 2024

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ముదిరాజ్ సంఘం – వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. రామాయణ మహా గ్రంథ రచయిత వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శంగా నిలిచారని, యువత ఆయన బోధనలను పాటించాలన్న సూచనలు ప్రముఖులు చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం, వాల్మీకి యూత్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment