- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయ్యారు.
- ఇజ్రాయెల్-గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు.
- గాజాను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా గాజా యుద్ధంపై చర్చించారు. గాజాను యాజమాన్య స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్-గాజా మధ్య జరుగుతున్న యుద్ధం, తాజా పరిణామాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. గాజాపై యాజమాన్య హక్కులను కలిగి ఉండాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ట్రంప్ తాజా వ్యాఖ్యలు కొత్త దిశగా రాజకీయ అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ ప్రకటనపై ఇతర దేశాల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.