మహాదేవపూర్ రేంజ్ అడవుల్లో పులి సంచారం – ప్రజల్లో భయాందోళన

Tiger_Sighting_Mahadevpur_Forest_Bhupalpally
  • భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి కనబడినట్టు సమాచారం
  • అటవీ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
  • ప్రజలకు అప్రమత్తం కావాలని సూచనలు – అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ శాఖ హెచ్చరిక
  • వెంకటి అనే వ్యక్తి పులిని చూసినట్లు గ్రామస్తుల వాదనలు
  • పులి సంచారంతో గ్రామాల ప్రజలు భయాందోళనలో

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ రేంజ్ పరిధిలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోంది. కాటారం మండలానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువులను చూసేందుకు అడవిలోకి వెళ్లి వస్తుండగా పులి మహదేవపూర్ వైపు వెళ్తూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, డిప్యూటీ రేంజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. పలు చోట్ల పులి పాద ముద్రలు కనిపించడం, పులి ఎప్పుడు వచ్చింది, ఎటు వెళ్లిందనే దానిపై అన్వేషణ చేయడానికి మరింత పరిశీలన చేస్తున్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో చాటింపులు నిర్వహించి, అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను అడవుల్లోకి మేపేందుకు పంపకూడదని సూచించారు.

పులి సంచారం నేపథ్యంలో ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment